" ఆశయాలు: 1.శాస్త్ర విజ్ఞానం ద్వారా మూఢ విశ్వాసాలను, ఛాందస భావాలను అరికట్టడం"

ఆశయాలు: 2. సామాన్య ప్రజల్లో శాస్త్ర విజ్ఞానం ప్రచారం చేయడం శాస్త్రీయ దృక్పధాన్ని పెంపోందించడం.

ఆశయాలు: 3. వివిధ రంగాలలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్రపరిశోధనల్ని ప్రోత్సహించడం.

ఆశయాలు: 4. ప్రజలు ఎదుర్కోంటున్న అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గురించి సమగ్రమైన శాస్త్రీయ అవగహనను పెంపొందించడం, పరిష్కరాలు అన్వేషించడం.

ఆశయాలు: 5. ఏ కొద్దిమందికో పరిమితమైన శాస్త్ర విజ్ఞానం సామాన్య ప్రజలకు సైతం అందేటట్లు ప్రయత్నించడం.

ఆశయాలు: 6. సత్యాన్వేషణకు, దేశస్వావలంబనకు, సమగ్రతకు, లౌకికతత్వానికి, ప్రపంచశాంతికి, సామాజికాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషిచేయడం.


The State unit of Jana Vignana Vedika which is striving to create awareness among people about the importance of science with the objectives of science for the people, science for the progress and science for self-reliance and also to impress them about the evils of superstitions since its inception1988 has been selected winner of National Award for Best Efforts for Science and Technology Communications for the year 2005. JVV is undertaking several programs like seminars, workshops, science fairs, training camps to inculcate the spirit of scientific temper in the society. Also JVV Championed many social tasks like literacy movement, prohibition of arrack, against fish medicine, Cool Drinks. JVV derives its strength from all sections of the society including scientists, professors, lecturers, teachers, doctors and many social activities. Besides JVV is running an exclusive 'Children's Science 'CHEKUMUKI' in Telugu since 1990. JVV has also published many books for the enhancement of children's creativity.

ప్రజల కోసం సైన్స్ - సైన్స్ కోసం ప్రజలు

"ప్రజల కోసం సైన్స్అనే నినాదంతో 1988 ఫిబ్రవరి 28న జనవిజ్ఞాన వేదిక ఆవిర్భవించింది. జనవిజ్ఞాన వేదిక ఆ నినాదాన్ని ఇవ్వవలసిన ఆవశ్యకత ఏమిటి? దేశ పరిస్థితులు ఏమిటి? పరిశీలిద్దాం.. భారతదేశంలో సైన్సు అనేక విషయాల్లో అభివృద్ధి చెందింది. అనేక సైన్స్ పరిశోధనాలయాలు వెలిశాయి. భారతీయులు సముద్రపు లోతుల్లోను, ఆకాశపుటంచుల్లోను విహరించగలుగుతున్నారు. అనేక వ్యాధులను అంతం చేయగలుగుతున్నారు. ఆకాశ హర్మ్యాలు నిర్మించగలుగుతున్నారు. నదుల జలాలకు అడ్డుకట్టలు కట్టి, బీడునేలలను సస్యశ్యామలం చేస్తున్నారు. మారుమూల పల్లెలకు కూడా విద్యుత్ వెలుగులు అందించుచున్నారు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ప్రగతికి ఒక పార్శ్యo మాత్రమే. ప్రగతి కి సంబంధించిన రెండో వైపునకు పరిశీలిస్తే, సైన్స్ వలన పెరిగిన అభివృద్ధి కొందరిని మాత్రమే చేరింది. కోట్లాది మంది ప్రజలకు సైన్సు ఫలాలు అందడం లేదు. ఆకాశ విహారాలు అతి కొద్ది మంది మాత్రమే చేయగలుగుతున్నారు. సుఖవంతమైన రైలు ప్రయాణం కూడా కొద్దిమంది ధనికులకే పరిమితం. వారు ఫస్ట్ క్లాసులో, ఏసీ బోగీల్లో ప్రయాణిస్తుంటే, పేదవారు జనరల్ బోగీల్లో కుక్కబడినట్లుగా ప్రయాణిస్తున్నారు. కొంతమంది గుండెకు బదులుగా గుండెను మార్పిడి చేయించుకుని స్థాయికి వైద్యశాస్త్రం ఎదిగినా, పేదలు విరోచనాలకు కూడా వైద్యం అందక రోజుకు కొన్ని వందల మంది ఆ వ్యాధితో మరణిన్నారని పత్రికా వార్తలు తెలియచేస్తున్నాయి. విద్యుత్తు వెలుగులు కొద్దిమంది పెద్దల ఇళ్లలోనే విరజిమ్ముతున్నాయి. మెజారిటీ ప్రజలకు వీధి దీపాలే గతి. ఈ పరిస్థితి దేనిని సూచిస్తోంది? సైన్సు ఫలితాలు ప్రజలందరికీ అందడం లేదని తెలియజేస్తుంది. ఈ పరిస్థితి మారాలి. సైన్సు ఫలితాలు ప్రజలందరికీ అందాలి. ఈ ఆశయంతోనే జన విజ్ఞాన వేదిక ఆనాడు "ప్రజల కోసం సైన్స్" అనే నినాదాన్ని ఇచ్చింది. ఆ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తోంది. కానీ, ఈనాటి పరిస్థితి ఏమిటి?

ఈనాడు దేశంలో ఒక విచిత్ర పరిస్థితి మొదలైంది. కొంతమంది నాయకులు, పాలకులు, సైన్స్ వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టారు. పైగా 'సైన్స్ అంటే అదే' అని గట్టిగా చెబుతున్నారు. కొద్దిమంది శాస్త్రవేత్తలు కూడా అదే బాటలో పోతున్నారు. ఉదాహరణకు మన ప్రధాని వినాయకుడికి ఏనుగు తల అతికించడం అనే కథ వెనుక కొన్ని లక్షల సంవత్సరాల నాడే ప్లాస్టిక్ సర్జరీ తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తోందన్నారు. విచిత్రమైన అంశం ఏమిటంటే, గ్రీకు, రోమన్ పురాణ గాధలలో గుర్రం శరీరము, మనిషి తల ఉన్న దేవుడు ఉన్నాడు. పాము శరీరం, మనిషి తల ఉన్న దేవత ఉంది. అంటే కొన్నివేల సంవత్సరాల క్రితం గ్రీకులకు, రోమన్లకు ప్లాస్టిక్ సర్జరీ తెలుసునని అంగీకరిద్దామా? ఎన్ని దేశాలలో ఆ విజ్ఞానం ఎందుకు కనుమరుగైంది? ఈ ప్రశ్నలకు ఆ నాయకుల వద్ద సమాధానం లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు కూడా నాన్ సైన్సును సైన్సు గా ప్రచారం చేయడం బాధాకరం. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సిలర్, శాస్త్రవేత్త అయిన నాగేశ్వరరావు మహాభారత కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీలను పుట్టించారనీ, గాంధారి నూరుగురు కొడుకులు అలా టెస్ట్ ట్యూబ్ బేబీ పరిజ్ఞానంతో, కుండలలో పుట్టబడిన వారేనని అన్నారు. అయితే ఫలదీకరణం చెందిన జీవకణాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెట్టితేనే  టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. గాంధారి గర్భం విచ్చిత్తి అయితే, ఆ పిండ భాగాలను కుండలలో పెడితే కౌరవులు పుట్టారని మహాభారతం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ లు సాంకేతికకు పూర్తి విరుద్ధ ప్రక్రియ జరిగింది. అయినా ఒక శాస్త్రవేత్త ఆ ప్రక్రియను బేబీ ల సాంకేతికత అని చెప్పడం నాన్ సైన్సును సైన్స్చెప్పడమే.

కాబట్టి ఈనాడు ప్రజలను సైన్స్ వైపు కాకుండా, సైన్స్ కోసం కాకుండా, నాన్ సైన్స్, నాన్సెన్స్ కోసం మళ్లించడం అనే ప్రమాదకరమైన పరిస్థితి మొదలైంది. దీన్ని నిరోధించాలి. ప్రజలను సైన్స్ వైపునకు మరలించాలి. "సైన్స్ కోసం ప్రజలు" అనే భావనను ప్రజలకు అందించాలి. అందుకే జనవిజ్ఞాన వేదిక సైన్సు దినోత్సవం రోజున ప్రజలకుప్రజల కోసం సైన్స్అని మాత్రమే కాకుండాసైన్స్ కోసం ప్రజలుఅనే నినాదాన్ని కూడా అందిస్తోంది. సైన్సును ప్రజలకు అందించడమే కాకుండా, ప్రజలను సైన్స్ కోసం మరలించే కృషిని కూడా చేపట్టింది. దేశభక్తులైన ప్రజలు ఈ నినాదాలను అందుకోవాలని జనవిజ్ఞాన వేదిక కోరుతోంది.
  - కె. ఎల్. కాంతారావు,        
     జన విజ్ఞాన వేదిక

బ్రాండెడ్ మందుల్లా జనరిక్ మందులు

*జనవిజ్ఞానవేదిక కృష్ణాజిల్లా*

ప్రశ్న:- *బ్రాండెడ్ మందుల్లా జనరిక్ మందులు పని చేయవంటున్నారు అది నిజమేనా*.. ?

జవాబు:- అందులో ఏమాత్రం నిజం లేదు. అవి వట్టి పుకార్లు మాత్రమే. బ్రాండెడ్ మందైనా లేదా జనరిక్ మందైనాఫార్ములా ఒకటైతే చాలురెండు మందులూ ఒకే విధంగా పని చేస్తాయి..
అసలు బ్రాండెడ్ మందులంటే ఎంటోఅలాగే జనరిక్ మందులంటే ఏంటో ముందు తెలుసుకుందాం..
ఏదైనా ఒక కొత్త మందునుఒక ఫార్మా కంపెనీ మా‌ర్కెట్ లోకి తెస్తేదానిపై ఆ కంపెనీకి 20 సం.లు పేటెంట్ హక్కులు ఉంటాయి..
అంటే ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా సరేదానిని ఓ 20 సం.ల పాటు (కాపీ కొట్టి) వేరే ఎవరూ తయారు చేయకూడదు..
అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపైదానిని మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే (ఆ మందుపై సదరు కంపెనీ పేటెంట్ గనక పొందితే) ఓ 20 సంవత్సరాల పాటు (పేటెంట్ హక్కులు లభించిన కంపెనీకి) గుత్తాది పత్యం ఉంటుంది..
వాస్తవాని ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏ మాత్రం పొంతన ఉండదు.. అంటే తయారీ ఖర్చు కంటే మందుయొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది..
అదేమంటే 'ఆ మందు తయారీ కోసం "పరిశోధనలు మరియూ క్షేత్ర స్థాయి పరీక్షల (Clinical Trials)" నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందనిసదరు కంపెనీ వాదిస్తుంది..
కాబట్టే ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై, ( కంపెనీకి) పేటెంట్ హక్కులు కల్పించిపెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికిఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం..
అలా మొదటి కంపెనీతన మందుకు ఒక పేరును కూడా పెట్టుకుంటుంది. ఆ మందుకు ఆ కంపెనీ పెట్టుకున్న పేరే "బ్రాండ్ నేం" లేదా ఆ మందును "బ్రాండెడ్ మందు" అంటారు. దానిపై ఆ ముందు యొక్క (కెమికల్) ఫార్ములా కూడా ఉంటుంది.
డాక్టర్లు ఎపుడూ మందు లేబుల్ పై ముద్రించబడి ఉండే ఈ ఫార్ములా పేరే రాయాలిబ్రాండ్ నేం ఎపుడూ రాయకూడదు. ఒక వేళ బ్రాండ్ నేం రాయాలనుకుంటే.. ముందుగా ఆ మందు యొక్క ఫార్ములాను పెద్దక్షలాతో రాసిఆటుతర్వాత కింద బ్రాకెట్లోచిన్నక్షరాలతో బ్రాండ్ నేం రాయవచ్చు..
ఇందాక చెప్పుకున్న ఉదాహరణలోని మందుపై మొట్టమొదటి కంపెనీ యొక్క పేటెంట్ పీరియడ్ ముగిసిన తర్వాతఅవే కెమికల్స్ ను ఉపయోగించిఅదే ఫార్ములాతోఅదే మందును (అదే కంపెనీ లేదా మరేదైనా కంపెనీ) తయారు చేసిమార్కెట్ లోకి విడుదల చేయొచ్చు..
అదే ఫార్ములాతోఅవే కెమికల్స్ తో అదే మందును వేరే కంపెనీ తయారు చేస్తేఆ మందుకు తను స్వంతంగా పెట్టుకున్న మరో పేరుతో మార్కేట్ లోకి విడుదల చేస్తుంది. అది కూడా బ్రాండ్ నేం కిందికే వస్తుంది. దాని రేటు కూడా అధికంగానే ఉంటుంది..
ఐతే ఒక మందుపై పేటెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత (అవే కెమికల్స్ తోఅవే ఫార్ములాతో తయారు చేసి) 30 నుండి 80 శాతం తక్కువ ధరలతో "జనరిక్" షాపుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలా తక్కువ ధరలకుజనరిక్ షాపుల్లో అమ్మే మందులనే జనరిక్ మందులంటారు. వీటిపై ముద్రించబడే యం ఆర్ పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు..
బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు. బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయోజనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి..
ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూఫార్మా ఎజెన్సీలకూమందుల షాపులకూ, ( కొన్ని సందర్భాలలో డాక్టర్లకు కూడా) అందరికీ నష్టమే కదా. అందుకనే జనరిక్ మందులపై, "అవి బ్రాంబెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు..
కాబట్టి మనలాంటి వాళ్ళంఇతర ప్రజా సంఘాల వాళ్ళు ఈ విషయమై ప్రజలను చైతన్య పరచాలి. సమాన్య జనం సధ్యమైనంత వరకు తక్కువ ధరల్లో లభించే జనరిక్ మందులనే కొనుక్కునేలా మనమందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..
   --- 
చెలిమెల రాజేశ్వర్జేవీవీతెలంగాణ.

సీతాదేవి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ

ప్రశ్న : సీతాదేవి టెస్ట్ట్యూబ్‌ బేబీ అనీనారదుడు నేటి గూగుల్కు సమానమనీపుష్పక విమానం నేటి విమానాలకు సమానమనీరామాయణ కాలం నాడే మనదేశంలో ఇవన్నీ తెలుసనీ కొందరు ప్రముఖులు ప్రకటిస్తున్నారుఇవెంత వరకు నిజం?

జవాబు : గతంలో చాలాసార్లు ఇదే శీర్షికలో చర్చించుకున్నట్టుగా అద్భుతమైన శాస్త్ర సాంకేతిక ఆధునిక ఆవిష్కరణలు జీవితంలో అంతర్భాగమయినపుడుఅవి కచ్చితంగా ఋజువయినపుడు  ఛాయలు మాకు ముందే తెలుసని చెప్పుకోవడం ఈమధ్య మామూలవుతోందిఒకవేళ వాళ్లు ఉటంకించే కాలాల్లో ఆధునిక శాస్త్ర సాంకేతిక నిరూపణలకు పూర్తి భిన్నంగా ఉన్న వాటిని ప్రస్తావిస్తే 'మా మనోభావాల్ని కించపరిచారనోఅవి శాస్త్ర సాంకేతిక పరిధిలోకి రావనోవాదిస్తారుటెస్ట్‌ ట్యూబ్‌ బేబీ అనేది రెండు రకాలుఒకటి తండ్రి శుక్ర కణాలనుతల్లి అండాన్ని తల్లి గర్భంలో కాకుండా పరీక్షా నాళికలో సంయోగపరుస్తారు విధంగా ఏర్పడ్డ సంయుక్త బీజకణాన్ని  కొన్ని విభజనలు అయ్యాక తల్లి గర్భంలో ప్రవేశపెడతారుఅప్పుడిక తల్లి గర్భంలో  బిడ్డ పెరిగి ప్రసవానంతరం మామూలు మనిషిలా మారుతుంది.ఇక్కడ సహజత్వానికి లేదా సాధారణతకు వేరుగా రెండు జరిగాయి.

 1. తల్లిదండ్రుల సంభోగంలో పాల్గొననవసరంలేదుతల్లితండ్రి ఇద్దరూ తమ శీలాన్ని కోల్పోలేదువారికి పెళ్లి కూడా కానవసరంలేదు. 2. పిండాన్ని మోస్తున్న తల్లి వాస్తవంగా  బిడ్డకు జీవశాస్త్రం ప్రకారంగా తల్లి కానవసరంలేదుకేవలం అద్దె తల్లి (డబ్బు తీసుకుంటుందా లేదా అన్నది వేరే విషయం). ఇలాంటి తల్లిని గర్భధారణ మాతృత్వం  అంటారు. 9 నెలలు మోయడంకనడం తప్ప  అద్దె తల్లి స్వయం అండం  బిడ్డ రూపొందడంలో అంతర్భాగం కాదుడీఎన్ పరీక్ష చేస్తే  తల్లి లక్షణాలు బిడ్డలో కనిపించవు

ఇక రెండవ రకపు పరీక్ష టెస్ట్ట్యూబ్‌ బేబీ ఏర్పడే పద్ధతి క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారాఇందులో తండ్రి శుక్రకణం అవసరం లేదుతల్లి అండంలో వున్న క్రోమోజోముల అవసరమూ లేదుకేవలం తల్లి అండపు గోడలు (ఖాళీ డబ్బాలాగాచాలుఅందులో తన మామూలు కణంలో వున్న 23 జతల క్రోమోజోముల్ని గానీ లేదా మరో పురుషుని మామూలు కణంలో వున్న 23 జతల క్రోమోజోముల్ని గానీ జొప్పిస్తే అపుడా అండం కృత్రిమంగా తయారయిన సంయుక్త బీజకణానికి సమానమవుతుందిఅలాంటి అండాన్ని  తల్లి లేదా మరో తల్లి గర్భపు గోడలపై అతికిస్తే 9 నెలల తర్వాత బిడ్డ తయారయి ప్రసవం ద్వారా బయటకు వస్తుంది బిడ్డ రూపు రేఖలు అచ్చం ఎవరి 23 జతల క్రోమోజోముల్ని  ఖాళీ అండంలో ఉంచారో  వ్యక్తిలాగానే వుంటాయిడాలీ అనే గొర్రె పిల్ల ఇలాగే పుట్టిందిగొర్రెపోతుతో సంభోగించబడకుండానే  తనలాంటి గొర్రెనే క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా కనిందిమానవ క్లోనింగ్‌ జరుగుతున్న వార్తలు వస్తున్నాయి గానీ వాస్తవాలు తెలీవుజనవిజ్ఞాన వేదిక మానవ క్లోనింగ్కు వ్యతిరేకం.
ఇందులో కూడా రెండు అసహజ విషయాలు లేదా సాధారణత్వానికి భిన్నంగా వున్నాయి

1. మగజాతి అవసరమే లేకుండా మానవుల్ని ఉత్పత్తి చేయగలం. 2. తల్లిదండ్రులు సంభోగంలో పాల్గొననవసరంలేదుకాబట్టి తల్లి శీలం చెడిపోలేదు

రామాయణ గాథలో సీతను 'అయోనిజఅంటారుఅంటే యోని  ద్వారా అందరిలాగా పుట్టలేదుసిజేరియన్‌ ఆపరేషన్ల ద్వారా పుట్టేవారు కూడా అదే అర్థంలో అయోనిజులేకానీ రామాయణ కథా రచనాకాలంలో (ఎందుకంటే రామాయణం గ్రంథోపగతికంగా మానవ చరిత్రలో భాగమైనట్టుగా దాఖలాలు లేవు.) సిజేరియన్‌ ఆపరేషన్లు తెలీవు కాబట్టిసహజ ప్రసవాలు  మాత్రమే తెలుసు కాబట్టి సీతను 'అయోనిజఅన్నారుకానీ సీత పుట్టుకకు తల్లితండ్రి లేరుకథలో తనంత తానుగా లక్ష్మీదేవి సీత రూపంలో శిశువుగా నేలలో పెట్టెలో ఏర్పడుతుందిజనకుడు పొలం దున్నుతుండగా (రాజులు అప్పుడప్పుడు హాబీగా పొలం వైపు వెళ్తారువారి ప్రధాన వృత్తి రాజ్య విస్తరణశృంగారక్రీడజంతువుల వేటఅలంకరణయజ్ఞయాగాదుల నిర్వహణపన్నుల సేకరణ వంటివినాగలికి సీత ఉన్న పెట్టె దొరుకుతుందిఆమెను పెంచి పెద్దచేసి రాముడితో కళ్యాణం జరిపిస్తారుఇక్కడ మీరన్న మేధావి  పెట్టెనే టెస్ట్ట్యూబ్గా భావించాడనే అనుకొందాంకేవలం తండ్రి అవసరంలేకుండానే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే జన్మించినదన్న ఒకేఒక్క ఊహ ద్వారానే ఆయన అపుడే (ఎన్ని సంవత్సరాల క్రితం అన్న లెక్క వారు చెప్పరుటెస్ట్ట్యూబ్‌ బేబీ అన్నారుకానీ వాస్తవంగా టెస్ట్ట్యూబ్‌ బేబీ ఆధునికతలో ఎంతో జీవశాస్త్ర పరిజ్ఞానం వుందిడీఎన్ నిర్మాణం వుందిదాన్ని తెలుసుకొనేందుకు ఎక్స్రే విశ్లేషణ పరిజ్ఞానం వుందిపరమాణువు నిర్మాణాన్ని గురించిన అవగాహనవర్ణ పట విశ్లేషణలుఅణు నిర్మాణంశవ రసాయనిక ధర్మాలు యిలాంటి ఎన్నో సునిశితమైన పరిశోధనలుఆవిష్కరణల పర్యవసానంగా  గతితార్కిక పద్ధతితో వరవడిలో డీఎన్ నిర్మాణం తెలియవచ్చింది.డీఎన్ నిర్మాణంకణ విభజనప్రత్యుత్పత్తి విధానాలుకణ విభజనలో మియాసిస్‌ విభజనమైటాసిస్‌ విభజనసంయుక్త బీజకణం ఏర్పాటయ్యే అంతర సంఘటనల గురించి సవివరంగా బోధపడ్డాకే క్లోనింగ్‌ ప్రక్రియకు మార్గం సుగమం అయిందివిజ్ఞానశాస్త్ర చరిత్రలో గానీమానవ సామాజిక చరిత్రలో ఏదీ మంత్రాలతో గానీ యాగాలతో గానీ జరగలేదు'హాం ఫట్‌' అంటే శిశువు పెట్టెలో ఏర్పడదుఅవన్నీ కేవలం ఊహాజనిత కథలు కథలు చాలా బాగా ఉంటాయిబాలనాగమ్మ కథలో మాయలఫకీరు ప్రాణం చిలుకలో వుందని అంటే కథే కదా అని సరిపెట్టుకొంటాంమీరన్న ప్రముఖుడు ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా ప్రతి మనిషి ప్రాణం రాయిలోనుచిలుకలోనుబొద్దింకలోను ఉందంటే... 

ఇలాంటి పెద్దమనుషుల చేతిలో దేశమేగతి బాగుపడునోయిఅని ఖిన్నుల వుతాముఒకవేళ వీరికి ఇవన్నీ కూడా తెలుసనే అనుకుందాంభూమాత గర్భం ఎక్కడీ  బిడ్డకు ప్లాసెంటా ఏదిఎలా ఎదిగిందిపెట్టెలో గాలిఆహారం ఎలా దొరికాయిఅగ్నిలో దూకితే కూడా కాలిపోకుండా ఉండగలరామనిషి (ఆంజనేయుడుగాలిలో ఎగరగలడాఇలాంటి ప్రశ్నలు వేస్తే 'మనోభావాలుఅంటూ వాదనకుదాడికి వస్తారు.

ప్రొరామచంద్రయ్యసంపాదకులుచెకుముకి,జన విజ్ఞాన వేదిక



I N V I T A T I O N

The free Bi-Monthly (Feb,Apr,Jun,Aug,Oct,Dec) Medical Camp held for B.P., Sugar pationts at Sree Chakri Vidyanikhatan High school, Chakripuram cross Road, ECIL to Nagaram, Hyderabad. This camp is conducted on every 4th sunday of the month from Morning 7am to 10am. The consultation includes Sugar Test, BP Test, Doctor consultation and Medicines. Only Rs.100/- will be charged for one month medicines. All are Invited
JANAVIGNANA VEDIKA (Affiliated to AIPSN)