" ఆశయాలు: 1.శాస్త్ర విజ్ఞానం ద్వారా మూఢ విశ్వాసాలను, ఛాందస భావాలను అరికట్టడం"

ఆశయాలు: 2. సామాన్య ప్రజల్లో శాస్త్ర విజ్ఞానం ప్రచారం చేయడం శాస్త్రీయ దృక్పధాన్ని పెంపోందించడం.

ఆశయాలు: 3. వివిధ రంగాలలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్రపరిశోధనల్ని ప్రోత్సహించడం.

ఆశయాలు: 4. ప్రజలు ఎదుర్కోంటున్న అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గురించి సమగ్రమైన శాస్త్రీయ అవగహనను పెంపొందించడం, పరిష్కరాలు అన్వేషించడం.

ఆశయాలు: 5. ఏ కొద్దిమందికో పరిమితమైన శాస్త్ర విజ్ఞానం సామాన్య ప్రజలకు సైతం అందేటట్లు ప్రయత్నించడం.

ఆశయాలు: 6. సత్యాన్వేషణకు, దేశస్వావలంబనకు, సమగ్రతకు, లౌకికతత్వానికి, ప్రపంచశాంతికి, సామాజికాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషిచేయడం.


The State unit of Jana Vignana Vedika which is striving to create awareness among people about the importance of science with the objectives of science for the people, science for the progress and science for self-reliance and also to impress them about the evils of superstitions since its inception1988 has been selected winner of National Award for Best Efforts for Science and Technology Communications for the year 2005. JVV is undertaking several programs like seminars, workshops, science fairs, training camps to inculcate the spirit of scientific temper in the society. Also JVV Championed many social tasks like literacy movement, prohibition of arrack, against fish medicine, Cool Drinks. JVV derives its strength from all sections of the society including scientists, professors, lecturers, teachers, doctors and many social activities. Besides JVV is running an exclusive 'Children's Science 'CHEKUMUKI' in Telugu since 1990. JVV has also published many books for the enhancement of children's creativity.

మూఢ నమ్మకాలపై నా పోరాటం-వీరేశలింగం పంతులు



తన *మూఢ నమ్మకాలపై నా పోరాటం* పుస్తకంలో వీరేశలింగం గారు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు .....

*జ్యోతిశ్శాస్త్రం:* నాకు మొదట మిక్కిలి విశ్వాసం ఉండేది.కానీ జన్మ పత్రికలలో దీర్ఘాయుష్మంతులవుతారని చెప్పినవాళ్లు అల్పాయుష్కులవడం,ధనవంతులవుతారని చెప్పినవాళ్లు దరిద్రులవడం. దీర్ఘసుమంగళిగా ఉంటారన్నవాళ్ళు బాలవితంతువులవడం చూశాక ఆ నమ్మకం పోయింది.ఒక్క విషయం ఆలోచించండి.మనదేశంలో వివాహాలకు ముహూర్తాలు పెట్టుకోకుండా వధూవరుల జాతకాలను పరీక్షించకుండా ఎవ్వరూ పెళ్లిళ్లు చెయ్యరు.మరి ఆ వివాహితులలో  లక్షల కొలదీ బాలవితంతువులెందుకవుతున్నారు ?( పే.12,13 ) 
*ముహూర్తాలు:* నాకు1872 వ సంవత్సరంలో కోరంగి అనే గ్రామంలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది.మంచి ముహూర్తం చూసుకుని చేరమని ఇతరులూ మావారూ నన్ను బలవంతపెట్టారు.నేను వారిని లక్ష్యపెట్టక అమావాస్య రోజు వెళ్లి ఉద్యోగంలో చేరాను.మా తాత గారి బంధువూ ,సముద్ర శుల్క పర్యవేక్షకుడూ( sea custom superintendent ) అయినబలిజేపల్లి నారాయణమూర్తి గారు అమావాస్యనాడేల బయలు దేరితివని నన్నడిగారు." ఈశ్వరుడు చేసిన దినములన్నియు సమానముగానే మంచివయినప్పుడు ఏ దినమున బయలుదేరిన ఏమని నేను బదులు చెప్పితిని.( పే 24 )

*కీడు చెట్టు:* మా దొడ్డి లోనున్న అరటిచెట్టు చిగురున కాకుండా నడుమన పువ్వు వచ్చి గెలవేసింది.అలా మధ్యనుండి గెలవేయడం అరిష్టమని వెంటనే చెట్టు కొట్టేయాలని ఇరుగుపొరుగువారూ బంధువులూ వెయ్యివిధాల చెప్పారు.ఎవరెన్ని చెప్పినా ఏమవుతుందో చూద్దామని దాన్ని అలానే ఉంచాను.కొన్నాళ్ల తరువాత కూరకోసమని కాయలూ .దూటకోసమని చెట్టూ కొట్టేయించాను.( పే 23)

*తేనెపట్టు:* మా యింటి దూలానికి పట్టింది.అలా పట్టడం అశుభమనీ ,దానిని తీయించేసి దోషం పోవడానికి బ్రాహ్మణులచేత శాంతి చేయించమని పదేపదే చెప్పారు.నేను చలించలేదు.ఈ బండవాడికి చెప్పడం వృధా అని ఊరుకున్నారు.( పే .24 )

*భూత వైద్యం:* ఒక్క దయ్యా న్నైనా చూపించండని ఎందరో భూత వైద్యులను బ్రతిమాలాను .ఎవ్వరూ చూపించలేదు.ఒకడు మాత్రం ఒక నాటి రాత్రి దూరముగా ఊరి వెలుపల మర్రి చెట్టు వద్దకు తీసుకుపోయి " దయ్యాన్ని చూపిస్తే నువ్వు జడుసుకుంటావు " అన్నాడు." నేను జడుసుకోను.దయచేసి చూపించు" అన్నాను." నువ్వు భయపడకపోయినా ప్రభుత్వంవల్ల నాకు చెడ్డపేరు వస్తుంది" అని చెప్పి వెళ్లి పోయాడు.ఎలాగైనా దయ్యాలను చూడాలని నేను చాలాసార్లు స్మశానానికి వెళ్ళాను.ఉపయోగం లేక కొంతమందిని అడిగాను." పిశాచగణములలో పుట్టినవారికి దయ్యములు కనబడవు " అన్నారు.( పే .20,21 )

ఇకనైన కలిగేన కనువిప్పు?

ప్రకృతి ఒడిలో సహజ వనరులను ఉపయోగించుకుంటూ జీవితాలు గడిపిన సమాజం ఉన్నట్టుండి కాలుష్యకోరల్లో ఎలా చిక్కుకున్నది? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ యువనికపైకి పారిశ్రామిక విప్లవం పెద్ద ఎత్తున దూసు కొచ్చిన తర్వాత కాలుష్యం రెక్క విప్పింది. పొగ గొట్టాలు, ఫాక్టరీ సైరన్లు అభి వృద్ధి చిహ్నాలుగా ముందు కొచ్చాయి. పారిశ్రామికీకరణ ప్రపంచ ముఖ చిత్రాన్ని క్రమంగా మార్చివే సింది. ఈ క్రమం లో పర్యావరణానికి తీరని హాని జరిగింది. చీడ పీడల నివారణ కు వాడే డీడీటీ వంటి పురుగు మందులు ఆహార వలయంలో చేరి తల్లిపాలను కలుషితం చేసి జనారోగ్యాన్ని తీవ్రంగా నష్టపరిచిన విషయాన్ని 1962లో రేచల్ కార్బన్ తన సైలెంట్ స్ప్రింగ్ గ్రంథంలో రుజువులతో సహా వివరించే వరకు ప్రపంచం కాలుష్య ప్రమాదాల పట్ల దృష్టి సారించనే లేదు. నివారణకు తీసుకున్న చర్యలు కూడా అంతంత మాత్రమే. భారతదేశం ఈ ప్రమాదాన్ని గుర్తించటానికి మరో రెండు దశా బాలు పట్టింది. 1983లో భోపాల్ గ్యాస్ సృష్టించిన మారణహోమం మ న దేశంలో పర్యావరణ స్పృహ కలిగించింది. దేశ వ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలు రావటానికి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి దోహదం చేసిందీ ఘటన. నాటి భోపాల్ దుర్ఘటన నుంచి నిన్నటి తూత్తుకుడి విషాదం వరకు దేశం నలుమూలల పర్యావరణం, జనారోగ్యం రెండూ బలవుతూనే ఉన్నాయి. పరిశ్రమ లు నెలకొల్పటమే అభివృద్ధికి కొలమానంగా చూసి పారిశ్రామిక వేత్తలకు ఎర్ర తివాచీలు పరుస్తున్నారు గానీ కలుగజేసే కోలుకోలేని హానిని గుర్తించడంలో ప్రభుత్వాలు సీతకన్ను వేశాయి. పారిశ్రామిక వ్యర్థాలు నదులను, చెరువులను కాలుష్య కాసారాలు చేస్తున్నా ప్ర భుత్వాలదీ, ప్రజలదీ ప్రేక్షక పాత్రే, జంట నగరాల మంచినీటి అవ సరాలు తీర్చిన హుస్సేన్ సాగర్ జలాల్లోకి పారిశ్రామిక వాడల వ్యర్థాలు వచ్చి చేరుతుంటే పాలకులకు పట్టిలేదు. ఇప్పుడు ఆ చెరువు ను ప్రక్షాళన చేయడానికి పథకాలు, ప్రయత్నాలు.. జరిగే పనేనా ఇది? హాస్యాస్పదంగా లేదూ! కానీ ఇది ఎవరో కొందరి వ్యక్తుల తప్పిదం కాదు, మనం ఎంచుకున్న అభివృద్ధి నమూనాలోనే లోపం ఉందని ఎన్నటికి గుర్తిస్తాం? ఇది లంచం చుట్టూ తిరుగుతుంది తప్ప ప్రజా సంక్షేమం, పర్యావరణం దానికి పట్టదు. పర్యావరణం దె బ్బతిని, భూతాపం పెరిగి వాతావరణం మొత్తంగా తీవ్ర మార్పులకు లోనై భూగోళం యావత్తూ పెను ప్రమాదపు అంచుల్లో ఉంది. 1880 నుండి ఇప్పటి వరకు భూ ఉపరితల ఉష్ణోగ్రత 1.8డిగ్రీలు పెరిగింది. భూ తాపానికి ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ సూ చీ 407 పిపియాలను దాటుతోంది. దీంతో మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి తీర ప్రాంత దేశాలనేకం ముంపు ముంగిట బిక్కుబిక్కుమంటున్నాయి. దీన్ని నివారించాలం టే తక్షణం భూ తాపానికి కళ్లెం వేయాలి. అందుకు కారణమైన హరిత వాయువుల విడుదలను నియంత్రించాలి. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై ఐక్య రాజ్య సమితి నేతృత్వంలో ఇందుకో పకడ్బందీ పథకా న్ని తయారు చేశారు. కాని సర్వ అనర్ధాలకు ఆధ్యుడైన అమెరికా మీ నమేషాలు లెక్కిస్తూ ఇటీవల ట్రంప్ నాయకత్వంలో ఆ అంతర్జా తీయ ఒప్పందం నుండి వైదొలిగింది. అసలు వాతావరణ మార్పే బూటకం అని బుకాయిస్తున్నది. 97 శాతానికి పైగా వాతావరణ శాస్త్రజ్ఞులు శాస్త్రీయ ఆధారాలతో చూపించిన వాతావరణ మారును. సెనును తపు బటడం శోచనీయం.

ప్లాస్టిక్ వాడకం విత్య జీవితం లో ప్రతి ఒక్కరికీ అనివార్యమైంది. దీంతో ఎంతో ఉపయోగం, వెసులుబాటు ఉన్నప్పటికీ, ప్లాస్టిక్ వ్యర్థాలు కలిగించిన ఆనర్థాలు పూచరణానికీ, మనిషితో సహా జీవజాతుల మనుగడకు నవ్వదా యకుగా పరిణమించాయి. భూ వాతావరణం, ఇది వనరులు, నదుల నుండి సముద్రాల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోతున్నా యి. తినే ఆహారు, తాగే వీళ్లు నా అన్నీ ప్లాస్టిక్ మయమే. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 500 బిలియన్ ప్లాస్టిక్ సంచులను వాడుతున్నాం. సముద్రాల్లో చేరే వ్యర్థాలు 6 మిలియన్ టన్నులు. ప్రతి విమిషం పది లక్షలు ప్లాస్టిక్ పీసాలను కొంటున్నాయి. వీటన్నిం టిలో ప్రమాదకరమైంది అతి పలుచని ఉల్లిపొరలో ఉండే పాలితీన్ సంచులు. ఇప్పటికైనా ఈ ఆనర్ధదాయక ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిచా రించకపోతే 2050 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాల సంఖ్యా చేవల్ని మించి పోతుంది. ఐక్య రాజ్య సమితి ప్రతి సంవత్సరం ఒక విషయాన్ని ఎంపిక చేసి, దాన్ని ప్రచారులో పెట్టి ప్రజలను ప్రభుత్వాలను అప్ర మత్తం చేయటం ఆనవాయితీ. గత ఏప్రిల్ 22న ధరిత్రి దినం సందర్భంగా ప్లాస్టిక్ దుర్వి వియోగాన్నీ అంతమొందించేందుకు పిలుపునిచ్చింది. మళ్లీ పర్యావరణ దీనం, జూన్ ఐదున కూడా ఇదే అం శాన్నీ ప్లాస్టిక్ కాలుష్యా న్నీ అంత మొందిచమని ఐక్య రాజు సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎస్ ఈపే) ప్రకటించింది. భారతదేశం వేదికగా ఈ సంవత్సరం పర్యావరణ కార్యక్రమాలను చేపట్టడం మరో విశేషం. పర్యావరణాన్ని మనమెందుకు కాపాడాలి? అందు కోసం అభివృద్ధిని బలి చేయాలా? అనే వితండ వాద వలను అప్పుడపుడూ వింటూ ఉంటాం. పర్యావరణ రక్షణ ఎవరి సైనో దయదలి వి చేసే పనికాదు. దానిలోనే మానవ శ్రేయస్సు, ఆ మాటకొస్తే వకల జీవుల క్షేమం దాగి ఉంది. మన చుట్టూ ఉన్న ప్రకృతి, వాతా వర Wం మన కోసమే లేదు. ఏ ఒక్కరి సొత్తూ రాదు. దాన్ని ననవరి చే పార్కు ఎవరికీ లేదు. ప్రకృతి వనరులు ఇప్పటికే తీవ్ర వష్టానికి లోనయ్యాయి. ఈ నష్టానికి నృప్తి పలకాలంటే సమగ్ర దృక్పథంతో పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి. ప్రతి ఒక్కరు పరాజరణయుతమైన ఒక మంచి పని రోజు చేస్తే మన భూగోశాన్ని పరీకుభ్రమైన హరిత నిలయంగా మన భవిష్యత్ తరాలకు అందించగలం.

పో. కట్టా సత్యప్రాసాద్, సెల్ : 9490098918

I N V I T A T I O N

The free Bi-Monthly (Feb,Apr,Jun,Aug,Oct,Dec) Medical Camp held for B.P., Sugar pationts at Sree Chakri Vidyanikhatan High school, Chakripuram cross Road, ECIL to Nagaram, Hyderabad. This camp is conducted on every 4th sunday of the month from Morning 7am to 10am. The consultation includes Sugar Test, BP Test, Doctor consultation and Medicines. Only Rs.100/- will be charged for one month medicines. All are Invited
JANAVIGNANA VEDIKA (Affiliated to AIPSN)